కరోనా మహమ్మారితో భారత్ వణికిపోతోంది. క‌రోనా వ‌ల‌న ప్ర‌జ‌ల ప‌రిస్థితి ధైన్యంగా మారింది. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి పలు ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాయి. లాక్‌డౌన్ కారణంగా ఇబ్బంది పడుతోన్న పేద ప్రజలను ఆదుకోవడానికి, ప్రభుత్వానికి మద్దతుగా సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సినీ తారలు విరాళాలు ప్రకటించారు. ఇప్ప‌టికే త‌మిళ న‌టులు సూర్య‌, కార్తీ, త‌మిళ ద‌ర్శ‌కుడు మురుగ దాస్ సీఎం స‌హాయ‌నిధికి కోటి రూపాయ‌లు విరాళం అందించ‌గా.. తాజాగా అజిత్ 25ల‌క్ష‌లు..ఆయన వంతుగా సీఎం స‌హాయ‌నిధికి ఆన్‌లైన్ ద్వారా పంపారు. గ‌త ఏడాది క‌రోనా విజృంభిస్తున్న స‌మ‌యంలో అజిత్ విరాళం అందించిన విష‌యం తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: