అమెరికన్లకు అక్కడి ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది. కోవిడ్-19పై పోరులో అగ్రరాజ్యం అమెరికా కీలక మైలురాయిని అందుకుంది. ఈ నేపథ్యంలో కోవిడ్ నిబంధనల్లో మార్పులు చేసింది. రెండు డోస్‌ల కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారు మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) స్పష్టం చేసింది. మాస్కులు ధరించడంపై అమెరికన్లకు ఆ దేశ వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం (సీడీసీ) కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నిర్ణయంపై అధ్యక్షుడు జో బైడెన్ హర్షం వ్యక్తం చేశారు. కరోనాపై సుదీర్ఘ పోరాటంలో ఇదో గొప్ప రోజు అని ఆయన వ్యాఖ్యానించారు. ఏడాదిన్నరగా మాస్క్‌లు ధరించాలని ప్రజలకు పదే పదే సూచించిన సీడీసీ తాజాగా నిబంధనలు సవరించింది. కరోనా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న ప్రజలు ధరించాల్సిన అవసరం లేదని పేర్కొంది. కరోనాతో నాడు అత్యంత దారుణంగా ప్రభావితమైన అమెరికా.. సాధారణ పరిస్థితుల వైపు శరవేగంగా అడుగులు వేస్తోందనడానికి ఇదే నిదర్శనం. అమెరికన్లకు వ్యాక్సిన్లను శరవేగంగా అందిస్తుండటం వల్లే ఈ మైలురాయి సాధ్యమైందని అధ్యక్షుడు జో బైడెన్ హర్షం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: