దేశవ్యాప్తంగా కరోనా తీవ్ర స్దాయిలో విజృంభిస్తుంది. ఇప్పటికే ఎంతో మంది రాజకియనాయకులను బలి తీసుకున్న ఈ మహమ్మారి కరోనా.. తాజాగా ఆప్‌ మాజీ ఎమ్మెల్యే జర్నైల్‌ సింగ్‌ (48) కరోనా ల‌క్ష‌ణాల‌తో క‌న్నుమూశారు. ఇటీవల కరోనా బారిన పడిన‌ ఆయన తొమ్మిది రోజుల నుంచి ఆస్ప‌త్రి ఐసీయూలో చికిత్స పొందుతూ శుక్ర‌వారం తుదిశ్వాస విడిచారని కుటుంబసభ్యులు తెలిపారు.  ఆప్‌ మాజీ ఎమ్మెల్యే జర్నైల్‌ సింగ్‌ మృతికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా సంతాపం తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: