తెలంగాణ పోలీసులు లాక్ డౌన్ నిబంధనల పేరుతో ఓ విద్యార్థిని చావబాదారు. ములుగు జిల్లాలోని ఏటూరు నాగారంలో పోలీసులు.. మాస్క్ పెట్టుకోలేదని రామన్నగూడెం గ్రామానికి చెందిన వేణు అనే బీఫార్మసీ విద్యార్థినిపై SI శ్రీకాంత్ ఒళ్ళు కమిలి పోయేలా కర్రలతో చితకబాదాడు. SIదెబ్బలతో ఒళ్ళంతా వాతలతో, తీవ్ర గాయలపాలైన బాధితుడు వేణు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కరోనా నిబంధనల పేరుతో ఎస్‌ఐ శ్రీకాంత్ రెడ్డి తనను చావబాదారని కేటీఆర్‌, డీజీపీ, పోలీస్ ఉన్నతాధికారులకు వేణు ఫిర్యాదు చేశాడు. అయితే తన పేరు బయటకు చెబితే వేరే కేసులు పెట్టి జైళ్లో వేస్తానని SI బెదిరించాడని వేణు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: