వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సీఐడీ పోలీసులపై న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. తన కాళ్లకు గాయాలయ్యాయని, పోలీసులు తనను కొట్టడం వల్లే గాయపడ్డానని రఘురామకృష్ణరాజు సీఐడీ కోర్టు న్యాయమూర్తికి తెలియజేశారు. గత రాత్రి తనను వేధింపులకు గురిచేశారని, అరికాళ్లు వాచిపోయేలా కొట్టారని వివరించారు. ఈ మేరకు నాలుగు పేజీల లిఖితపూర్వక ఫిర్యాదు అందజేశారు.రఘురామ రిమాండ్‌ రిపోర్టును సీఐడీ న్యాయస్థానం పెండింగ్‌లో పెట్టింది. ఎంపీ కాళ్లకు తగిలిన గాయాల ఆధారాలను ఆయన తరఫు న్యాయవాదులు కోర్టు ముందు ఉంచగా.. రఘురామను ఆస్పత్రికి తరలించాలని న్యాయస్థానం సూచించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: