వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సీఐడీ పోలీసులపై న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. తన కాళ్లకు గాయాలయ్యాయని, పోలీసులు తనను కొట్టడం వల్లే గాయపడ్డానని రఘురామకృష్ణరాజు సీఐడీ కోర్టు న్యాయమూర్తికి తెలియజేశారు, ఎంపీ కాళ్లకు తగిలిన గాయాల ఆధారాలను ఆయన తరఫు న్యాయవాదులు కోర్టు ముందు ఉంచగా.. రఘురామను ఆస్పత్రికి తరలించాలని న్యాయస్థానం సూచించింది. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సకు ఆయన నిరాకరించడంతో.. రఘురామకు రమేశ్‌ ఆస్పత్రిలోచికిత్స చేయించాలని జడ్జి ఆదేశించారు. కాగా, తనను పోలీసులు కొట్టడంతో గాయపడ్డానని రఘురామ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయగా, ఆయనకు తగిలిన గాయాల వివరాలను కోర్టు నమోదు చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: