ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. కరోనా పాజిటివ్ కేసులతో పాటు .. కరోనా మరణాల సంఖ్య కూడా పెరిగిపోతుంది. గత 24 గంటల్లో కొత్తగా 22,517 కరోనా కేసులు నమోదు కాగా, 98 మరణాలు సంభవించాయి. గడిచిన 24 గంటల్లో 18,739 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. కరోనా నుంచి ఇప్పటి వరకు 11,94,582 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,07,467 గా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: