తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతుంది. క్రమ క్రమంగా కరోనా పాజిటివ్ కేసులు మరియు కరోనా మరణాలు తగ్గుతున్నాయి. ఇక తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 4298 కరోనా కేసులు నమోదయ్యాయి.తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 64,362 టెస్టులను చేయగా.. 4,298 పాజిటివ్‌ కేసులు, 32 మరణాలు నమోదయ్యాయి. ఈ మేరకు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులిటెన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 5,25,007కి చేరాయి. కరోనా నుంచి 4,69,007 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. రాష్ట్రంలో ప్రస్తుతం 53,072 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. కరోనాతో ఇప్పటివరకు 2,928 మంది మృతి చెందారు. ఇదిలా ఉండగా, తెలంగాణలో రికవరీ రేటు 89.33 శాతంగా ఉందని వైద్యశాఖ వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: