ఏపిలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంది. రోజు వారి కరోనా పాజిటివ్ కేసులు మరియు కరోనా మరణాలు రికార్డ్  స్దాయిలో నమోదు అవుతున్నాయి. శనివారం ఉదయం 9 గంటలనుంచి ఆదివారం ఉదయం 9 గంటల మధ్య రాష్ట్రవ్యాప్తంగా.. 24 గంటల వ్యవధిలో24,171 మందికి కరోనా నిర్ధారణ అయింది. 101 మంది మరణించారు. ఒకే రోజు వందకుపైగా మరణాలు నమోదవ్వటం ఈ నెలలో ఇది రెండోసారి. రాష్ట్రంలో ప్రతి గంటకు సగటున 1,007 మంది కొవిడ్‌ బారిన పడుతుండగా.. నలుగురు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈనెల ఒకటో తేదీన 19.76 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు క్రమంగా పెరుగుతూ ఆదివారంనాటికి 25.56 శాతానికి చేరింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: