తెలంగాణ రాష్ట్రంలో రేషన్ బియ్యం పంపిణీ ఈ నెల 20 వరకు కొనసాగించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. సాధారణంగా ప్రతి నెల ఒకటో తేదీ నుంచి బియ్యం పంపిణీ ప్రారంభమై.. 15తో ముగుస్తుంది. అయితే ఈ నెల కొన్ని కారణాలతో పంపిణీ మూడు రోజులు ఆలస్యంగా ప్రారంభమయ్యింది. దీంతో లబ్ధిదారుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో కొన్ని జిల్లాల్లో ఈ నెల 18 వరకు, మరికొన్ని జిల్లాల్లో 20 వరకు బియ్యం పంపిణీకి అనుమతినిచ్చారు.
మరింత సమాచారం తెలుసుకోండి: