కరోనా మహమ్మారి దొరికిన వారిని దొరికిన్నట్లు కాటేస్తుంది. ఇప్పటికే ఈ రక్కాసి కరోనా తో ఎంతో మంది ప్రముఖులు మరణించగా..తాజాగా కళింగ దర్పన్‌ టీవీ చానల్‌ ఎండీ బిష్ణు ప్రసాద్‌ సాహు (48) ఆదివారం కన్నుమూశారు. కొద్దిరోజుల కిందట కరోనా వైరస్‌ బారినపడిన బిష్ణు ప్రసాద్‌ చికిత్స పొందుతూ పరిస్ధితి విషమించడంతో మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
 ఆయన మృతి పట్ల జర్నలిస్టులు తమ సంతాపం ప్రకటించారు. ప్రతిదిన్, ఒడిశా భాస్కర్‌ వంటి దినపత్రికల్లో రిపోర్టర్‌గా పనిచేసిన బిష్ణు ప్రసాద్‌.. మూడేళ్ల కిందట బరంపురం నగరంలో కళింగ దర్పన్‌ పేరిట టీవి చానల్‌ ప్రారంభించి, పేరు ప్రఖ్యాతలు పొందారు.

మరింత సమాచారం తెలుసుకోండి: