కొవిడ్‌ చికిత్సలో భాగంగా ఉపయోగించే 2-డయాక్సి-డీ గ్లూకోజ్‌(2డీజీ) ఔషధం మార్కెట్లోకి విడుదలైంది.  ఔషధాన్ని సోమవారం ఢిల్లీలో కేంద్ర రక్షణ, ఆరోగ్యశాఖ మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, హర్షవర్ధన్‌ విడుదల చేశారు. మొదట రక్షణ మంత్రి డ్రగ్‌ను విడుదల చేసి ఆరోగ్యశాఖ మంత్రికి అందజేయగా.. డ్రగ్స్‌ను ఢిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియాకు అందజేశారు. పదివేల డోసులను ఢిల్లీలోని పలు ఆసుపత్రులకు పంపిణీ చేయనున్నారు. దీన్ని హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌తో కలిసి డీఆర్‌డీవో అభివృద్ధి చేసింది. నీటిలో కలుపుకొని తాగేలా పౌడర్‌ రూపంలో ఈ ఔషధాన్ని తయారు చేశారు. ఆక్సిజన్‌పై చికిత్స పొందే సమయాన్ని ఈ ఔషధంతో తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: