న‌ర్సాపురం పార్ల‌మెంటు స‌భ్యుడు రాఘురామ కృష్ణంరాజు కేసు ఆస‌క్తిక‌రంగా మారింది. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చినట్టు తెలుస్తోంది. రఘురామకు హైదరాబాద్‌లో వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించినట్టు సమాచారం. నగరంలోని ఆర్మీ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. అటార్నీ జనరల్‌ అభిప్రాయం తీసుకున్న తర్వాత తుది ఆదేశాలు వెలువడనున్నాయి. తదుపరి విచారణను ధర్మాసనం మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేసింది. ఈలోపు మెయిల్‌ ద్వారా సంబంధిత పత్రాలను పంపించాలని సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: