తెలంగాణలో లాక్‌డౌన్, రాత్రి కర్ఫ్యూ అమలు తీరుపై రాష్ట్ర హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఇవాళ సుదీర్ఘ విచారణ జరిగింది. లాక్‌డౌన్‌, కరోనా నిబంధనల అమలు తీరుపై డీజీపీ కోర్టుకు నివేదిక సమర్పించారు. "ఔషధాల బ్లాక్ మార్కెట్‌‌పై 98 కేసులు నమోదు చేశాం. ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద 57 సహాయ కేంద్రాల ఏర్పాటు చేశాం. లాక్‌డౌన్, రాత్రి కర్ఫ్యూ పకడ్బందీ అమలుకు చర్యలు తీసుకున్నాం. ఈ నెల 01 నుంచి 14 వరకు 4,31,823 కేసులు నమోదు చేశాం. ముఖ్యంగా మాస్కులు ధరించనందుకు 3,39,412 కేసులు నమోదు చేయడంతో పాటు రూ.31కోట్ల రూపాయిలు జరిమానాలు విధించాం. భౌతిక దూరం పాటించనందుకు 22,560 కేసులు నమోదు చేశాం. కర్ఫ్యూ నిబంధనల ఉల్లంఘనపై 26,082 కేసులు నమోదు చేశాం’ అని హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో డీజీపీ స్పష్టంగా వివరించారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌, కరోనా నిబంధనల అమలు తీరులో పోలీసుల పనితీరు మంచిగా ఉందని హైకోర్టు ప్రశంసించింది. భవిష్యత్‌లోనూ ఇదే రీతిలో పనిచేయాలని  తెలంగాణ పోలీసులకు సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: