విద్యా బలన్ నటించిన ఇంట్రెస్టింగ్ మూవీ డైరెక్ట్ గా డిజిటల్ వరల్డ్ లో విడుదలకు సిద్ధమయ్యింది. ఇదివరకే 'శకుంతల దేవి' లాంటి విభిన్నమైన సినిమాతో ఓటీటీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న విద్యా బాలన్ ఇప్పుడు మరో సినిమాను కూడా సిద్ధం చేసింది. ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రలో నటించిన 'షెర్ని' అనే సినిమాకు గత రెండు నెలలుగా వివిధ ఓటీటీ సంస్థల నుంచి ఆఫర్స్ వస్తున్నప్పటికి.. చివరికి అమెజాన్ ప్రైమ్ రిలీజ్ హక్కులను దక్కించుకుంది. ఈ సినిమాను జూన్ లో విడుదల చేయనున్నట్లు అఫీషియల్ గా క్లారిటీ  ఇచ్చారు. 'షెర్ని' చిత్రంలో శరద్ సక్సేనా, ముకుల్ చద్దా, విజయ్ రాజ్, అరుణ్, బ్రిజేంద్ర కాలా, నీరజ్ కబీ వంటి ప్రముఖ నటీనటులు ముఖ్యమైన పాత్రల్లో నటించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: