దర్శకుడి ఇంట్లో కరోనా విషాదాన్ని మిగిల్చింది. కోలీవుడ్ డైరెక్టర్, లిరిసిస్ట్, నటుడు అరుణ్ రాజా కామా రాజ్ భార్య కరోనాతో మృతి చెందారు. అరుణ్ రాజా భార్య సింధూజ గత కొన్ని రోజులు క్రితం కరోనా బారిన పడ్డారు. అయితే పరిస్థితి విషమించడంతో నేటి ఉదయం ఆమె కన్నుమూశారు. అరుణ్ రాజా భార్య మృతితో ఆయన అభిమానులు సోషల్ మీడియాలో సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఈ మేరకు కోలీవుడ్ ప్రముఖులు అరుణ్ రాజాకు ధైర్యాన్ని చెబుతూ పోస్ట్‌లు పెడుతున్నారు. ఆయన భార్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.పిజ్జా సినిమాతో పాటల రచయితగా కోలీవుడ్‌లోకి అడుగుపెట్టేశారు అరుణ్ రాజా కామా రాజ్. ఆ తరువాత రాజా రాణి సినిమాతో నటుడిగా మరో అవతారం ఎత్తేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: