కరోనాతో అల్లాడిపోతున్న తమిళనాడుకు కోలీవుడ్ చిత్ర పరిశ్రమ భారీ విరాళాలు అందిస్తుంది. ఇప్పటికే తలైవా రజనీకాంత్ స్వయంగా సీఎం స్టాలిన్ కార్యాలయానికి వెళ్లి రూ.50 లక్షల చెక్కు అందజేశారు. కరోనా సహాయకచర్యలకు ఉపయోగించాలని కోరారు. తాజాగా, ప్రముఖ నటుడు విక్రమ్ తనవంతు విరాళం ప్రకటించారు. ఆన్ లైన్ ద్వారా 30 లక్షల రూపాయలను తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి బదిలీ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: