తెలంగాణలో గత కొన్నిరోజులుగా కరోనా రోజువారీ కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలోనూ కొత్త కేసుల సంఖ్య దిగివస్తోంది. గడచిన 24 గంటల్లో తెలంగాణలో 62,591 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,961 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 631 మందికి కొత్తగా కరోనా నిర్ధారణ అయింది. ఇతర జిల్లాలు క్రమంగా కోలుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. కొత్తగా మరో 30మంది మరణించగా.. 5559మంది కోలుకున్నారు. తాజా గణాంకాలతో కలుపుకొంటే రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 5,32,784కి చేరాయి. వీరిలో 4,80,458మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 2985మంది కొవిడ్‌తో మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం 49,341 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తెలంగాణలో రికవరీ రేటు 90.17శాతం ఉండగా.. మరణాల రేటు 0.56శాతంగా ఉంది. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే సోమవారం 631 కొత్త కేసులు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: