మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశారు. శామీర్‌పేట‌లోని త‌న నివాసం నుంచి భారీ కాన్వాయ్‌తో ర్యాలీగా ఈట‌ల రాజేంద‌ర్ గన్ పార్క్ వ‌ద్ద‌కు వ‌చ్చారు.గ‌న్‌పార్క్ వ‌ద్ద అమ‌ర‌వీరుల స్తూపానికి నివాళ్లు అర్పించిన అనంత‌రం అసెంబ్లీలోని స్పీక‌ర్ కార్యాల‌యంలో త‌న రాజీనామా ప‌త్రాన్ని అందించారు.ఈట‌ల రాజేంద‌ర్ రాజీనామా ఆమోదించిన త‌రువాత హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ఉప ఎన్నిక ఎప్పుడు జ‌రుగుతుంద‌నేది ఉత్కంఠ‌గా మారింది. 14వ తేదీన ఈట‌ల రాజేంద‌ర్ ఢిల్లీ వెళ్లి బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు న‌డ్డా స‌మ‌క్షంలో చేర‌నున్నారు.బీజేపీలో చేరిన అనంత‌రం హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ఉప ఎన్నిక‌ల‌కు రెఢీ అవ్వాల‌ని ఇప్ప‌టికే ఇంఛార్జ్ త‌రుణ్ చుగ్ చెప్ప‌డంతో ఉప ఎన్నిక‌పైనే ఈట‌ల దృష్టి పెట్ట‌నున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: