టీడీపీని చంద్రబాబు, లోకేష్ లను ఎప్పటికప్పుడు టార్గెట్ చేసి ట్వీట్ లు చేసే విజయ సాయి రెడ్డి తాజాగా మరో సారి టార్గెట్ చేశారు. టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ ఒకేచోట 56 ఎకరాల ప్రభుత్వ భూమిని మింగేశాడని తేలిందని ఆయన పేర్కొంటూ సాక్షి పేపర్ లో వచ్చిన ఒక కధనాన్ని షేర్ చేశారు. 



అంతే కాక ఆ కధనాన్ని ఉదహరిస్తూ పచ్చ గెద్దలు విశాఖలో భూముల్ని, కొండల్ని, కాలువల్ని, గెడ్డల్ని ఎలా తన్నుకుపోయారో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఇక విశాఖ భూ ఆక్రమణలపై మాట్లాడితే బెజవాడ కరకట్ట కొంపలో భూకంపం వస్తోంది. ఈ లింకేంటో  త్వరలోనే తేలుతుందని ఆయన అన్నారు. ఇక ఇప్పటికే విశాఖలో కార్యనిర్వాహక రాజధాని కోసం ప్రభుత్వం అన్నీ సిద్దం చేస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: