తెలంగాణా మాజీ మంత్రి ఈటల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పించిన సంగతి తెలిసిందే. ఆయన రాజీనామాను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆమోదించారు. ఈ ఉదయం 11 గంటలకు ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి నేడు రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళ్ళులర్పించిన అనంతరం అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయానికి వెళ్లి ఈటల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 


అయితే కరోనా కారణంగా ఆయనకు స్పీకర్ అపాయింట్ మెంట్ దొరకక పోవడంతో స్పీకర్ ఫార్మేట్‌లో ఉన్న తన రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. మరో పక్క ఆయన ఈరోజు ఢిల్లీ వెళ్లనున్నారు. రెండ్రోజుల పాటు బీజేపే ముఖ్య నేతలను కలవనున్న ఆయన 14న జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: