బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు ఏపీ సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు. జగన్ కు 151 సీట్లు ఇవ్వడం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం అని వ్యాఖ్యానించారు. లోపభూయిష్టమైన టాక్స్ విధానం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కరోనా సమయంలో ప్రజలపై ఆస్తి పన్ను రూపంలో భారం వేయడం దారుణమని విష్ణు కుమార్ రాజు అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు.

లోపభూయిష్టమైన ప్రభుత్వంపై మాట్లాడే ధైర్యం ప్రజలకు లేదని అన్నారు. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకురావాలనే ఆలోచన..ఒక పనికిమాలిన చర్య అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆలోచన లేని అప్పులు చేయడం చాలా దారుణమని అన్నారు. భవిష్యత్తులో ప్రైవేటు సంస్థల ఆస్తులు కూడా జగన్ అమ్మేస్తారని అన్నారు. ప్రతి  ఒక్కరు దీన్ని ఖండించాలని చెప్పారు. ఈ ప్రభుత్వం కూల్చివేతల ప్రభుత్వం అంటూ విష్ణు కుమార్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Bjp