ఓ అరుదైన శ‌స్త్ర చికిత్స చేసి విశాఖ‌ప‌ట్నం డాక్ట‌ర్లు స‌భాష్ అనిపించుకున్నారు. డాక్ట‌ర్లు త‌లుచుకుంటే ఏ ప‌రిస్థితుల్లో నుండి అయినా రోగిని కాపాడ‌గ‌ల‌ర‌ని ప్రూవ్ చేశారు. వివ‌రాల్లోకి వెలితే....ఇటీవ‌ల ఓ గ‌ర్బిణికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. ఆరోగ్యం క్షీణించ‌డంతో ప్ర‌స్తుతం ఆ మ‌హిళ‌కు వెంటిలేట‌ర్ పై చికిత్స అందిస్తున్నారు. కాగా నిన్న ఆ మ‌హిళ‌కు పురిటినొప్పులు రావ‌డంతో ఆపరేషన్ చేసి బిడ్డను భ‌య‌ట‌కు తీశారు. అయితే తల్లికి కరోనా సోకిన్నప్పటికీ.. బిడ్డకి నెగిటివ్ రావడం సంతోషకరమ‌ని చెప్పాలి. ప్ర‌స్తుతం త‌ల్లీ బిడ్డ ఇద్ద‌రూ క్షేమంగా ఉన్న‌ట్టు వైద్యులు వెల్ల‌డించారు. అరుదైన శస్త్ర చికిత్స చేసి బిడ్డను కాపాడటం చాలా సంతోషంగా ఉందని గైనకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ పద్మ లీల అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: