గుంటూరు జిల్లాలో భారీగా నకిలీ మద్యం పట్టుబడింది. గత ఏడాది
అక్టోబర్ లో
వెల్దుర్తి మండలం ఉప్పలపాడు లో కూడా భారీగా నకిలీ మద్యం పట్టుబడుతుంది. ఎస్ఈబీ అధికారులు ఎంత నిఘా పెట్టినా నకిలీ మద్యం సరఫరా ఆగడం లేదు.గోవా, కర్ణాటక రాష్ట్రాల నుంచి తెచ్చిన మద్యాన్ని ఇక్కడ భూముల్లో పాతిపెడుతున్నారు.భూమిలో దాచిన 32 లక్షల విలువైన మద్యం ను ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు. పట్టుబడిన మద్యాన్ని టెస్టింగ్ కోసం అధికారులు ల్యాబ్కు పంపించగా ఈ మద్యం నకిలీదని ల్యాబ్ రిపోర్ట్లో బట్టబయలైంది.ఈ నకిలీ మద్యాన్ని అధికారులు దగ్గరుండి రోడ్ రోలర్తో ధ్వంసం చేశారు.