వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సీఎం జగన్ కు రోజుకో లేఖ రాస్తున్నారు. ఇప్పటికే ఏపిలో వృద్ధాప్య ఫించన్ ను పెంచాలని, సీపీఎస్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రఘురామ లేఖలు రాసిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలంటూ రఘురామ జగన్ కు లేఖ రాశారు. 

ఈ లేఖలో ప్రభుత్వం హామీ ఇచ్చిన ఉద్యోగాలు ఇవ్వకపోవడం వల్ల నిరుద్యోగులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ ఏడాది నిరుద్యోగుల్లో ఉగాది పండుగ ఆనందాన్ని తీసుకురాలేకపోయిందని తెలిపారు. హామీ ఇచ్చిన విధంగా ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేయకపోవడంతో లక్షలాది నిరుద్యోగ యువత ఆశలు ఆవిరైపోయాయని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: