భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ కే కాక సౌత్ మొత్తానికి ఎంట్రీ ఇచ్చిన కియారా అద్వానీ సినీ రంగంలోకి అడుగుపెట్టి నేటికీ ఏడేళ్లు పూర్తయ్యాయి. ఫగ్లీ అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఎంఎస్ ధోని సినిమాతో పాపులర్ అయింది. ఆ తర్వాత వినయ విధేయ రామ అనే తెలుగు సినిమాలో కూడా ఈ భామ నటించింది. ప్రస్తుతం ఎక్కువగా హిందీ సినిమాల మీద ఫోకస్ పెట్టింది. 


భామ త్వరలో సౌత్ ఇండస్ట్రీ రాబోతున్నట్లు హింట్ ఇచ్చింది. ఆమె అభిమాని ఒకరు సౌత్ సినిమా మీ కోసం వెయిట్ చేస్తోంది అని త్వరగా ఇక్కడికి వచ్చి చాలా సినిమాలు చేయాలని కోరగా ఆమె త్వరలోనే ఒక ఎగ్జైటింగ్ అనౌన్స్ మెంట్ తో వస్తున్నానని ప్రకటించి షాకిచ్చింది. ఎన్టీఆర్ - కొరటాల శివ సినిమా మొదలు త్రివిక్రమ్ - మహేష్ సినిమా అలాగే మరికొన్ని సినిమాల్లో ఆమెను హీరోయిన్గా తీసుకుంటున్నారు అంటూ గతంలో పెద్దఎత్తున ప్రచారాలు జరిగాయి. మరి ఏ సినిమాలో ఆమె ఎంపికయింది అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: