క‌రోనా వ్యాక్సిన్ల కోసం హైద‌రాబాద్ ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు.జీహెచ్ఎంసీలో వ్యాక్సిన్ స్పెష‌ల్ డ్రైవ్‌ని అధ‌కారులు ఏర్పాటు చేశారు. అయితే ముంద‌స్తు స‌మాచారం ఇవ్వ‌కుండానే వ్యాక్సిన్ సెంట‌ర్ల‌ను అధికారులు మార్చారు.న‌గ‌ర వ్యాప్తంగా దాదాపుగా ప‌ది పంక్ష‌న్ హాల్లో ఈ వ్యాక్సిన్ డ్రైవ్‌ల‌ను ఏర్పాటు చేసిన అధికారులు స‌మాచారం ఇవ్వ‌కుండానే మార్పు చేయ‌డంపై న‌గ‌ర‌వాసులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే ఫంక్ష‌న్ హాల్ 15 రోజుల‌కు కాంట్రాక్టు ముగియండంతోనే సెంట‌ర్ల‌ను మార్చామ‌ని అధికారులు చెప్తున్నాప్ప‌టికీ మార్చిన సెంట‌ర్ల అడ్రెస్ ముందుగా చెప్ప‌క‌పోవ‌డంతో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: