ఏపీలో వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల క‌ల్లా పార్టీని బ‌లోపేతం చేయాల‌ని ఢిల్లీ అధిష్టానం యోచిస్తుంది.దీనికి అనుగుణంగా విజ‌య‌వాడ‌లో కేంద్ర వీదేశీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి పి.ముర‌ళీధ‌రం అధ్య‌క్ష‌త‌న ముఖ్య నేత‌ల స‌మావేశం నిర్వ‌హిచారు.ఈ స‌మావేశానికి నేషనల్ జాయింట్ సెక్రటరీ శివ ప్రకాష్ సింగ్,సోమూవీర్రాజు, పురంధేశ్వరి, సత్యకుమార్,కన్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌తో పాటు నలుగురు రాష్ట్ర ప్రధాన కార్యదర్సులు హాజ‌రైయ్యారు. స‌మావేశంలో ప్ర‌ధానంగా ఏపీలో బీజేపీని బ‌లోపేతం చేయ‌డంపైనే చ‌ర్చ జ‌ర‌గ‌నుంది. దీంతో పాటు ఏపీ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను చ‌ర్చించి వాటిపై కార్య‌చ‌ర‌ణ రూపొందించ‌నున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: