ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఒక మ‌హిళ‌పై యాసిడ్ దాడి జ‌రిగింది. కృష్ణా జిల్లా  మైలవరం మండలంలోని గణపవరం గ్రామంలో క‌ట్టా వెంకాయ‌మ్మ అనే 38 సంవ‌త్స‌రాల మ‌హిళ‌పై స్నాన‌పు గ‌దులు శుభ్రంచేసే యాసిడ్‌తో ప‌టాపంచుల గోపీ అనే 35 సంవ‌త్స‌రాల యువ‌కుడు దాడిచేశాడు. శ‌రీర‌మంతా మంట‌లు రావ‌డంతో బాధితురాలికి మైల‌వ‌రంలోని ప్ర‌భుత్వాస్ప‌త్రిలో చికిత్స‌నందిస్తున్నారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు న‌మోదు చేశారు. వెంకాయ‌మ్మ‌కు భ‌ర్త లేక‌పోవ‌డంతో కొద్దికాలంగా గోపీతో స‌హజీవ‌నం చేస్తోంది. ఆస్తికి సంబంధించిన విష‌యంలో ఇద్ద‌రిమ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో వెంకాయ‌మ్మ కొద్దిరోజులుగా గోపీతో దూరం జ‌రిగి ఒంట‌రిగా జీవిస్తోంది. ఈ వివాదం నేప‌థ్యంలోనే గోపీ యాసిడ్‌తో దాడిచేయ‌గా నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: