ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా గ‌ర‌గ‌ప‌ర్రులో ద‌ళితులు ఆందోళ‌న బాట ప‌ట్టారు.వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణం రాజుకు వ్య‌తిరేకంగా ద‌ళితులు నినాదాలు చేశారు.ద‌ళితుల‌పై ర‌ఘురామ‌కృష్ణం రాజు అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని స్థానిక పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. ర‌ఘురామరాజు ఎంపీ ప‌ద‌వి నుంచి భ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని ద‌ళితులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మ‌ని ద‌హ‌నం చేశారు.అయితే వైసీపీ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పై ర‌ఘురామ‌కృష్ణంరాజు సీఎం జ‌గ‌న్‌కు వ‌రుస‌గా లేఖ‌లు రాస్తున్నారు. ఉద్యోగాలు, పెన్ష‌న్లు, పెళ్లికానుకలు, సీపీఎస్ ర‌ద్దు వంటి ఎన్నిక‌ల హామీల‌ను గుర్తు చేస్తూ సీఎం జ‌గ‌న్‌కు లేఖ‌లు రాస్తున్నారు.ఇదే స‌మ‌యంలో గ‌ర‌గ‌ప‌ర్రులో ద‌ళితులు ఆందోళ‌న చేయ‌డంతో ఎంపీ ర‌ఘురామ‌కృష్ణం రాజు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: