సిద్దిపేటలో అమానుష ఘటన చోటుచేసుకుంది. మాంసం  కోసం నలుగురు యువకులు బతికున్న బతికున్న గేదెల తొడలను కోసారు. ఈ ఘటన సిద్దిపేటలోని కొండపాక మండలం సిరిసినగండ్ల గ్రామంలో చోటు చేసుకుంది. సిరిసినగండ్ల లోని రాజేందర్ రెడ్డి అనే వ్యక్తికి చెందిన  వ్యవసాయ క్షేత్రంలో ఐదుగురు యువకులు పనిచేస్తున్నారు. వారిలో ఒకరు నేపాల్ కు చెందిన యువకుడు సందీప్ కాగా మిగిలిన ముగ్గురు ఏపీకి చెందిన వారు ఉన్నారు. కాగా రామగిరి వెంకటేశం అనే రైతు తన పొలంలో గేదెలను కట్టేసి ఇంటికి వెళ్ళాడు.

మరుసటి రోజు ఉదయం వచ్చి చూడగా గేదలు తీవ్ర రక్తస్రావమై చనిపోయాయి. వాటికి తీవ్రమైన గాయాలు కనిపించడంతో గ్రామస్తులంతా వెతకడం ప్రారంభించారు. అయితే పక్కనే ఉన్న పొలంలో ఏపీకి చెందిన ముగ్గురు యువకులు నేపాలి యువకుడితో కలిసి మాంసాన్ని  వండటానికి సిద్ధమవుతున్నారు. గ్రామస్తులు అక్కడకు చేరుకోవడంతో ముగ్గురు యువకులు పారిపోయారు. నేపాల్ కి చెందిన సందీప్ అనే యువకుడు పట్టుబడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఎస్సై కొమురయ్య నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: