సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుని లోకేష్ టార్గెట్ చేస్తూ స్వీట్లు చేసే విజయసాయిరెడ్డి తాజాగా మరో సారి ట్వీట్ తో చంద్రబాబును టార్గెట్ చేశారు. ప్రజలు వీళ్ల ఏడుపులు అర్థం చేసుకోలేనంత అమాయకులేం కాదన్న ఆయన మన  వాడు సిఎంగా లేడు అనేదే వీళ్ల కుళ్లు అంతా అని అన్నారు. దోచుకోవడం తప్ప జనం గురించి ఏనాడు ఆలోచించని బాబుని 14 ఏళ్లు సిఎంగా నెత్తిన పెట్టుకున్నారని, అదో మహా తప్పిదం అని తెలిశాక ఈడ్చికొట్టారని అన్నారు.

 అలా పెద్ద నాయుడి చాప్టర్ ముగిసిందని అన్నారు. ఇక సిఎం జగన్ గారు కలిసిన కేంద్ర మంత్రులంతా ఆయనలోని దార్శనికతను, రాష్ట్రం అభివృద్ధి పట్ల పడుతున్న తపనను కొనియాడారు. పక్క రాష్ట్రంలో ఉండి శోకాలు పెడుతున్న పచ్చ బ్యాచికి మింగుడు పడితే ఎంత...పడకపోతే ఎంత. జగన్నాథ రథచక్రాల పరుగు ఆగదని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: