విశాఖ‌ప‌ట్నం పరువును మంత్రి అవంతి శ్రీ‌నివాస్ నిలువునా తీశార‌ని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెల‌గ‌పూడి రామ‌కృష్ణ‌బాబు విమ‌ర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో కూల్చ‌డ‌మేకానీ క‌ట్ట‌డం తెలియ‌ద‌ని ఎద్దేవా చేశారు. న‌గ‌రంలోని భూముల‌ను తాక‌ట్టు పెట్ట‌డం స‌రైనది కాద‌ని, దీంతో విశాఖ‌ప‌ట్నం ప‌రువుతోపాటు రాష్ట్రం ప‌రువుకూడా పోయింద‌న్నారు. ఆదివారం విశాఖ ఎంవీపీకాల‌నీలో విలేక‌రుల‌తో మాట్లాడిన వెల‌గ‌పూడి రాష్ట్ర ప్ర‌భుత్వంపై, మంత్రి అవంతిపై నిప్పులు చెరిగారు. తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ప‌ల్లా శ్రీ‌నివాస‌రావు భూముల‌ను క‌బ్జా చేశార‌ని చెబుతున్నార‌ని, ప్ర‌భుత్వ స‌ర్వేయ‌ర్ల‌తోనే ఆ భూముల్లోకి వెళ్లి రికార్డుల‌న్నీ ప‌రిశీలిద్దామ‌ని, అవి నిజ‌మేన‌ని నిరూపిస్తే ప‌ల్లా రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటార‌ని, లేదంటే మంత్రి రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటారా? అని స‌వాల్ విసిరారు. ప్ర‌భుత్వ భూముల‌ను తాక‌ట్టు పెడుతుండ‌టంపై ప్ర‌జ‌లు ఆలోచించాల‌ని, లేదంటే త‌ర్వాత ప్ర‌యివేటు ఆస్తుల‌ను కూడా ఈ ప్ర‌భుత్వం తాక‌ట్టు పెట్టడానికి సిద్ధంగా ఉంద‌ని హెచ్చ‌రించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: