దేశంలో డ్రగ్స్ కల్చర్ రోజురోజుకీ పెరిగిపోతోంది. పట్టణాలు గ్రామాలు అని తేడా లేకుండా యువత డ్రగ్స్ మత్తులో తూలుతున్నారు. తాజాగా ముంబైలో గంజాయి తో కేకులు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద 850 గ్రాముల బ్రౌన్ షుగర్ మరియు 120 గ్రాముల గంజాయిని గుర్తించారు.  

అంతేకాకుండా ముఠాలో ఓ యువతి తో పాటు మరో ఇద్దరు యువకులు ఉన్నారు. ఈ సందర్భంగా ఎన్సిబీ అధికారులు మాట్లాడుతూ... దేశంలో డ్రగ్స్ కేకులు తయారు చేయడం ఇదే మొదటి సారి అని చెప్పారు. డ్రగ్స్ తీసుకునేందుకు యువత కొత్త దారులను వెతుక్కున్నారని చెప్పారు. డ్రగ్స్ ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి నష్టమే అని పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: