తెలంగాణ బీజేపీ నేత‌లు ఢిల్లీ బాట‌ప‌ట్టారు. రేపు మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ న‌డ్డా స‌మ‌క్షంలో బీజేపీలో చేర‌నున్నారు. ఈనేప‌థ్యంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ఈ రోజే ఢిల్లీ వెళ్లారు. తెలంగాణ బీజేపీలో భారీగా చేరిక‌ల నేప‌థ్యంలో సంజ‌య్ ఒక రోజుముందుగానే జేపీ న‌డ్డాతో స‌మావేశమ‌య్యారు.ఈట‌ల చేరిక త‌రువాత హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల్లో అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై బండి సంజ‌య్ చ‌ర్చించే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం.అయితే ఈట‌ల‌తో పాటు ల‌క్ష్మ‌ణ్‌,డీకే అరుణ‌,సోయం బాపురావు,వివేక్‌,ముర‌ళీధ‌ర‌రావు,త‌దిత‌రులు రేపు ఉద‌యం ప్ర‌త్యేక విమానంలో ఢిల్లీకి వెళ్ల‌నున్నారు.ప్ర‌స్తుతం కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్‌లు ఢిల్లీలోనే ఉన్నారు.ఈట‌ల చేరికతో తెలంగాణ బీజేపీ మ‌రింత బ‌ల‌ప‌డుతుంద‌ని బీజేపీ నేత‌లు ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: