దేశంలో మహిళల రక్షణకోసం ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా మానవ మృగాల్లో మార్పు రావడం లేదు. రోజూ ఎక్కడో ఒక చోట మహిళలపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా వరంగల్ జిల్లాలోని రంగశాయి పేటలో దారుణం చోటచేసుకుంది. వరంగల్ కు చెందిన ఓ మూగ యువతి(23)తల్లి చనిపోయింది. అయితే తండ్రి పనిమీద బయటకు వెళ్లడంతో అమ్మమ్మ ఇంటి వద్ద వదిలి వెళ్ళాడు.

కాగా అదే ప్రాంతంలో ఉండే ముగ్గురు బాలురు ఇంటికి వచ్చిన యువతి అమ్మమ్మ మాటల్లో పెట్టారు. ఆమెకు కంటి చూపు సరిగ్గా లేకపోవడం తో ఒకరి తరవాత ఒకరు యువతి పై అత్యాచారానికి పాల్పడ్డారు. తండ్రి ఇంటికి వచ్చిన తరవాత యువతి జరిగిన దారుణం చెప్పింది. దాంతో ఆయన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు 15,16 ఏళ్ల వయసు వారేనని పోలీసులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: