టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ హీరోగా నటిస్తున్న సినిమా మ్యాస్ట్రో. ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో హీరోయిన్ లుగా నభా నటేష్, తమన్నా నటిస్తున్నారు. తాజాగా  ఈ సినిమా చివరి షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ పూర్తి కాబోతుంది.

ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన మరియు పోస్టులకు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. నితిన్ కెరీర్ లో 30వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంతో ఖచ్చితంగా హిట్ కొట్టాలని నితిన్ కూడా పట్టుదలతో ఉన్నాడు. ఇదిలా ఉండగా కరోనా తరవాత టాలీవుడ్ లో షూటింగ్ ప్రారంభం చేసిన పెద్ద సినిమా ఇదే కావడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: