ఢిల్లీ ఇందిరాగాంధీ అంత‌ర్జాతీయ విమానాశ్రాయాంలో బాంబు ఉన్న‌ట్లు పోలీసులకు ఫోన్ కాల్ రావ‌డం క‌ల‌క‌లం రేపింది.ఉద‌యం 7.45 నిమిషాల‌కు ఓ అంగంత‌కుడిని నుంచి పోలీసుల‌కు బాంబు బెదిరింపు కాల్ వ‌చ్చింది.ఫోన్ చేసిన వ్య‌క్తి ఆకాష్ దీప్‌గా పోలీసులు గుర్తించి అత‌డిని అదుపులోకి తీసుకున్నారు.అయితే ఆకాష్‌ దీప్ విమానంలోప‌లే అత‌ని తండ్రితో కూర్చుని ఈ కాల్ చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు.ఆకాష్ దీప్ మాన‌స్తితి స‌రిగా లేదని పోలీసులు ప్రాథ‌మికంగా నిర్థార‌ణకు వ‌చ్చారు. అయితే బాంబుతో ఒక్క‌సారిగా ఎయిర్‌పోర్ట్‌లోని ప్ర‌యాణికులు ఒక్క‌పారి ఉలిక్కిప‌డ్డారు. చివ‌రికి పోలీసులు రంగ‌ప్ర‌వేశం చేసి పేక్ కాల్‌గా నిర్థారించ‌డంతో అంద‌రూ ఊపిరిపీల్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: