బాలీవుడ్ తెరపై మెరుపులా దూసుకొచ్చిన ప్రతిభావంతుడు సుశాంత్సింగ్ రాజ్పుత్ అర్థాంతరంగా తన జీవితాన్ని ముగించేసిన విషయం తెలిసిందే. ఈరోజుకి సుశాంత్ బలవన్మరణానికి పాల్పడి ఏడాది. ఈ కేసులో పలువురిపై అనుమానాలున్నాయని, తమ కొడుకు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదంటూ సుశాంత్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్య అని అనుమానం వ్యక్తం చేశారు. ఏడాదైనప్పటికీ ఇంతవరకు కేసులో పురోగతి లేదంటూ ఉదయం నుంచి అన్నివర్గాల ప్రజలు తీవ్ర విమర్శలు వ్యక్తం చేశారు. దీంతో సీబీఐ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. కేసులో పరిశోధన ఇంకా కొనసాగుతోందని, అన్ని విషయాలను పూర్తిగా అవగతం చేసుకొని దర్యాప్తు చేస్తున్నామంటూ ఆ ప్రకటనలో పేర్కొంది. 34 సంవత్సరాల వయసున్న సుశాంత్ కేసును సీబీఐతోపాటు ముంబయి పోలీసులు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఈడీ, బీహార్ పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. అతని ప్రియురాలు రియా చక్రవర్తితో సహా పలువురు అనుమానితులను విచారించారు. సినిమా థ్రిల్లర్ను తలపించేలా ఈ కేసు అనేక మలుపులు తిరుగుతోందేకానీ మిస్టరీ మాత్రం వీడలేదు.
బాలీవుడ్ తెరపై మెరుపులా దూసుకొచ్చిన ప్రతిభావంతుడు సుశాంత్సింగ్ రాజ్పుత్ అర్థాంతరంగా తన జీవితాన్ని ముగించేసిన విషయం తెలిసిందే. ఈరోజుకి సుశాంత్ బలవన్మరణానికి పాల్పడి ఏడాది. ఈ కేసులో పలువురిపై అనుమానాలున్నాయని, తమ కొడుకు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదంటూ సుశాంత్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్య అని అనుమానం వ్యక్తం చేశారు. ఏడాదైనప్పటికీ ఇంతవరకు కేసులో పురోగతి లేదంటూ ఉదయం నుంచి అన్నివర్గాల ప్రజలు తీవ్ర విమర్శలు వ్యక్తం చేశారు. దీంతో సీబీఐ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. కేసులో పరిశోధన ఇంకా కొనసాగుతోందని, అన్ని విషయాలను పూర్తిగా అవగతం చేసుకొని దర్యాప్తు చేస్తున్నామంటూ ఆ ప్రకటనలో పేర్కొంది. 34 సంవత్సరాల వయసున్న సుశాంత్ కేసును సీబీఐతోపాటు ముంబయి పోలీసులు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఈడీ, బీహార్ పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. అతని ప్రియురాలు రియా చక్రవర్తితో సహా పలువురు అనుమానితులను విచారించారు. సినిమా థ్రిల్లర్ను తలపించేలా ఈ కేసు అనేక మలుపులు తిరుగుతోందేకానీ మిస్టరీ మాత్రం వీడలేదు.