బోరుబావులు చిన్నారుల ప‌ట్ల శాపంగా మారాయి. బోర్లు వేసి నీళ్లు ప‌డ‌క‌పోవ‌డంతో వాటిని మూసివేయ‌కుండా అలాగే ఉంచ‌డం వ‌ల్ల అందులో చిన్నారులు పడిపోయి ప్రాణాలు కోల్పోతున్నారు.ఇప్ప‌టి వ‌ర‌కు ఇలాంటి ఘ‌ట‌న‌లు ఎన్నో జ‌ర‌గ‌టంతో ప్ర‌భుత్వం బోరుబావుల‌ను మూసేయాల‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. కానీ నిర్ల‌క్ష్యంతో కొంత మంది వాటిని అలాగే వ‌దిలేస్తున్నారు. దాంతో అమాయ‌క చిన్న‌పిల్ల‌లు అందులోప‌డి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా యూపీలోని ఫ‌తేబాద్ జిల్లా ద‌ర‌బాయి గ్రామంలో నాలుగేళ్ల చిన్నారి ఆడుకుంటూ బోరుబావిలో ప‌డిపోయాడు. స‌మాచారం అందిన పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. చిన్నారిని ప్రాణాలతో భ‌య‌ట‌కు తీసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. బాబు బోరుబావిలో ప‌డ‌టంతో ఊరంతా విషాదం నిండుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: