గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల ఫైల్‌కు గ‌వ‌ర్న‌ర్ ఆమోదం తెలిపారు. నాలుగురోజుల క్రితం అభ్య‌ర్థుల పేర్ల‌ను పంపిన‌ప్ప‌టికి గ‌వ‌ర్న‌ర్ ఆమోదం తెల‌ప‌లేదు.సీఎం జ‌గ‌న్ పంపిన న‌లుగురు పేర్ల‌లో ఇద్ద‌రిపై క్రిమిన‌ల్ కేసులున్నాయ‌ని అందుకే ఆమోదించ‌డంలేద‌న్న వార్త‌ల‌తో నేరుగా రంగంలోకీ సీఎం దిగారు. ఈ రోజు సాయంత్రం స‌తీస‌మేతంగా గ‌వ‌ర్న‌ర్ ని జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి క‌లిశారు. ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల ఫైల్‌ను ఆమోదించాల‌ని ఆయ‌న కోరారు. జ‌గ‌న్ విజ్ఞ‌ప్తి మేర‌కు గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హరిచంద‌న్ అభ్య‌ర్థుల ఫైల్‌కు ఆమోదం తెలిపారు.దీంతో గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీలుగా గుంటూరు జిల్లా నుంచి లేళ్ల అప్పిరెడ్డి, తూర్పుగోదావ‌రి జిల్లా నుంచి తోట త్రిమూర్తులు, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా నుంచి మోషేన్ రాజు, క‌డ‌ప జిల్లా నుంచి ర‌మేష్ యాద‌వ్‌లు ఎన్నిక‌కానున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: