సమాజంలో ట్రాన్స్ జెండర్ లను కొంతమంది చూపు చూస్తారు. వాళ్ళను చూసి నవ్వడం..వాళ్ళు వస్తే పక్కకు జరగటం లాంటివి చేస్తుంటారు.  ఈనేపథ్యంలో వాళ్ళు బయటకు రావడానికి పెద్దగా ఆసక్తి చూపించరు. అయితే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా బువనేశ్వర్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో ట్రాన్స్ జెండర్ ల కోసం స్పెషల్ దేశం డ్రైవ్ నిర్వహించారు.

అంతేకాకుండా ఒకే రోజు 500 మంది ట్రాన్స్జెండర్ లకు వ్యాక్సిన్లు వేశారు. గుర్తింపు కార్డులు లేని వారికి కూడా త్వరగా వ్యాక్సిన్ ఇవ్వాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు జోనల్ డిప్యూటీ కమిషనర్ అన్షుమాన్ తెలిపారు. ఈ సందర్భంగా ట్రాన్స్ జెండర్ రాగిణి దాస్ మాట్లాడుతూ సమాజంలో ఇతరులతో సమానంగా తమకు వ్యాక్సిన్ వేయడం సంతోషంగా ఉందన్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: