సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ రమణ నేడు యాదాద్రికి  రానున్నారు. ఆయన ఉదయం ఏడు గంటలకు సతీసమేతంగా హైదరాబాద్ నుండి బయలుదేరి మొదటగా కొత్తగా నిర్మించిన వివిఐపి అతిథి గృహానికి చేరుకుంటారు. దర్శనం తరవాత పునర్నిర్మిస్తున్న ఆలయ పనులను సందర్శిస్తారు.

అతిథి గృహంలోనే అల్పాహారం చేస్తారు. అయితే ముందుగా అనుకున్నట్టుగా సిజేఐ వెంట గవర్నర్ తమిళిసై సీఎం కేసీఆర్ రావట్లేదని అని అధికారిక వర్గాలు వెల్లడించాయి. దాంతో సీజేఐ కి అతిథి మర్యాదలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి చూసుకోబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: