బెంగళూరులో COVID-19 కేసుల పెరుగుదల నేపధ్యంలో బహిరంగ ప్రదేశాల్లో సెక్షన్ 144 కింద విధించిన ఆంక్షలు జూన్ 21 వరకు పొడిగించారు. వాస్తవానికి జూన్ 14 వరకు 144 సెక్షన్ విధించారు. అయితే కరోనా కేసులు తగ్గుదల లేకపోవడంతో దానిని 21వ తేదీ అర్ధరాత్రి వరకు మళ్ళీ పొడిగించారు. 


అయితే రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, ఎయిర్పోర్ట్లు 144 సెక్షన్ నుంచి మినహాయించ బడతాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాలు అన్ లాక్ దిశగా పరుగులు పెడుతున్న సంగతి అందరికే తెలిసిందే. ఇప్పటికే ఏపీ, తెలంగాణ కూడా అన్ లాక్ దిశగా పయనిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: