కొద్ది రోజుల క్రితం టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి తాజాగా బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఈటెల రాజేందర్ అండ్ కో కి పెను ప్రమాదం తప్పింది. ఈటల రాజేందర్ ఢిల్లీ నుంచి హైదరాబాదు రావాల్సిన విమానానికి సాంకేతిక సమస్య ఏర్పడింది.. ఈ ప్రత్యేక విమానం పైలెట్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింనట్లు అయింది.. పైలెట్ అలర్ట్ కావడంతో టేకాఫ్ అవుతున్న సమయంలో సాంకేతిక సమస్యలను గుర్తించి అక్కడికక్కడే నిలిపివేశారు..


 దీంతో ఉదయం 10 గంటలకే శంషాబాద్ విమానాశ్రయం చేరుకోవాల్సిన ప్రత్యేక విమానం ఢిల్లీ నుంచి ఇప్పుడు బయలుదేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే రఘునందన్ రావు, వివేక్, ఏనుగు రవీందర్ రెడ్డి తుల ఉమ సహా విమానంలో మొత్తం 184 మంది ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: