కడప జిల్లాలో కాల్పుల కలకలం రేగింది. పులివెందుల మండ‌లం న‌ల్ల‌పురెడ్డిప‌ల్లెలో కాల్పులు జరిగాయి. పార్థ‌సార‌థి అనే వ్య‌క్తిపై శివ‌ప్ర‌సాద్‌రెడ్డి అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో పార్థ‌సార‌థిరెడ్డి అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు.  కాల్పులు జరిపిన శివ‌ప్ర‌సాద్‌రెడ్డి కూడా తన తపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడంతో ఇరువురు మృతి చెందారు. వ్యక్తిగత గొడవులు పాతకక్షలే కారణం అంటున్నారు స్దానికులు. ఈ ఘటనతో జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. 



పార్ధసారధిరెడ్డి మచ్చుకత్తి తీసుకొని ప్రసాద్ రెడ్డి ఇంటిపైకి రాగా కాల్పులు జరిపినట్లు కుటుంబీకులు చెబుతున్నారు. ప్రసాద్ రెడ్డి, పార్థసారధి రెడ్డి  ఇరువురు వైసిపి నేతలే అని పైగా బందువులని అంటున్నారు. ప్రసాద్ రెడ్డి మాజీ ఎంపిటిసీ కాగా ఆయన సతీమణి  ప్రస్తుత ఎంపిటిసీ అని తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: