సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్‌వీ రమణ సతీసమేతంగా యాదాద్రిలో కొలువై ఉన్న లక్ష్మీ నరసింహా స్వామిని దర్శించుకున్నారు. ఇక రమణ దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఇక ఆ తరువాత రమణ దంపతులు బాలాలయంలో ప్రత్యేక పూజలు, అర్చన, అభిషేకం నిర్వహించి మొక్కు చెల్లించుకున్నట్టు సమాచారం. 

అనంతరం అర్చకులు వారికి వేదాశీర్వచనం చేసి, స్వామివారి శేషవస్త్రం, స్వామి వారి పటం మాత్రమే కాక తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇక రమణ దంపతులకు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.

మరింత సమాచారం తెలుసుకోండి: