మణికొండలో విషాదం చోటుచేసుంకుంది. వ్యాక్సిన్ వేయించుకోవడం ఇష్టం లేక శివప్రకాశ్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యాక్సిన్ వేయించుకోమని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేయడంతో ఇష్టలేక చివరికి తన ప్రాణాలను తీసుకున్నాడు.దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.ఘటనపై రాయదుర్గం పోలీసులుయ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.వ్యాక్సిన్ వేయించుకుంటే ఏమవుతుందనే భయంతోనే ఆత్మహత్య చేసుకన్నాడా... లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: