జ‌బ‌ర్దస్త్ షోతో పాపులారిటీ సంపాదించుకున్న హైప‌ర్ ఆది తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. హైప‌ర్ ఆది తెలంగాణ యాస‌ను, భాష‌ను కించ‌ప‌రుస్తూ మాట్లాడారని ఆరోపిస్తూ తెలంగాణ జాగృతి నాయ‌కులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. జూన్  12 ఆదివారం రోజున ఈ టీవీలో ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షోలో హైప‌ర్ ఆది బతుకమ్మను, గౌరమ్మను, తెలంగాణ భాష యాసను అవ‌మానించేలా స్కిట్ చేశాడ‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతే కాకుండా జాగృతి ఫెడ‌రేష‌న్ స‌భ్యులు హైప‌ర్ ఆది తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆది తెలంగాణ యాస‌ను కించ‌ప‌రిచార‌ని వెంట‌నే మ‌ల్లె మాల ప్రొడ‌క్ష‌న్ కూడా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని జాగృతి డిమాండ్ చేసింది. ఇలాంటి స్కిట్ లు ఇంకోసారి చేస్తే దాడులు కూడా చేస్తామ‌ని జాగృతి స్టూడెంట్ నాయ‌కులు వార్నింగ్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: