దేశంకోసం ప్రాణాలు అర్పించిన అమ‌ర్ జ‌వాన్ క‌ల్న‌ల్ సంతోష్‌బాబు మ‌ర‌ణించి నేటిటి ఏడాది కావోస్తుంది.గ‌త ఏడాది భార‌త్ చైనా బోర్డ‌ర్‌లో జ‌రిగిన యుద్దంలో క‌ల్న‌ల్ సంతోష్ బాబు మ‌ర‌ణించారు.దేశానికి ఆయ‌న చేసిన సేవ‌ల‌కు గుర్తింపుగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో నేడు విగ్ర‌హాన్ని ఏర్పాటు చేశారు.జిల్లా కేంద్రంలోని కోర్ట్ చౌర‌స్తాలో సంతోష్‌బాబు విగ్ర‌హా ఆవిష్క‌ర‌ణ‌కు ఏర్పాట్లు పూర్తి చేశారు.మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ ఈ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించ‌నున్నారు.జిల్లా మంత్రి జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి గ‌తంలోనే సంతోష్‌బాబు కుటుంబ సభ్యుల‌కు  విగ్ర‌హాన్ని ఏర్పాటు చేసి కోర్ట్ చౌర‌స్తాకు సంతోష్‌బాబు పేరు పెడ‌తామ‌ని హామీ ఇచ్చారు. ఏడాదిలో ఈ హామీ కార్య‌రూపం దాల్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: